అమరావతి : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యా రు. తానా బోర్డు సభ్యుడు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, అతడి ఇద్దరు కుమర్తెలు మృతి చెందారు. కృష్ణా జిల్లాకు చెందిన పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన శ్రీనివాస్ కుటుంబం హ్యూస్టన్లో స్థిరపడ్డారు. భార్య వాణి ఇద్దరు కుమార్తెలను కళాశాల నుంచి తీసుకువస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారును వ్యాను వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.