అమరావతి : ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి సోమవారం సాయంత్రం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఏపీకి వచ్చేవారికి ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయాలని, ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలి.. ర్యాపిడ్ టెస్టులు వద్దని సూచించారు. కేంద్రంనుంచి వస్తున్న వ్యాక్సిన్ను వీలైనంత త్వరగా వినియోగించాలని పేర్కొన్నారు.
డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్, ఫీవర్ సర్వే చేయాలని, అందరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని, జన సమూహం కాకుండా చూడాలని ఆయన వెల్లడించారు. ఏ అనారోగ్య సమస్య ఉన్నా 104కు కాల్ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. డిసెంబర్ కల్లా రెండుకోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్లో మాక్ డ్రిల్ చేయాలి నిర్వహించాలని జగన్ ఆదేశించారు.