అమరావతి : ఏపీలో ఇంటర్ (AP Inter) చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించింది. ఇక గడువును పొడిగించేది లేదని స్పష్టం చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను వచ్చే ఏడాది మార్చి నెలలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు (Exam Fees) తేదీని డిసెంబర్ 24 ఆఖరు గడువని స్పష్టం చేసింది.
ఫీజు గడువు ముగియడంతో ఈనెల 31 వరకు తత్కాల్ పథకం కింద ఫీజు చెల్లించవచ్చని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృతికాశుక్లా తెలిపారు. గతంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు అపరాధ రుసుముతో కలిపి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు విడివిడిగా రూ. 3 వేల చొప్పున చెల్లించాలని ఆమె సూచించారు. పరీక్షఫీజుకు సంబంధించి భవిష్యత్లో ఇక ఎలాంటి పొడిగింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు,ప్రైవేట్ (ఫెయిలైన) విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి .