అమరావతి : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) విడుదల చేయడం పట్ల ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రభుత్వంపై మండి పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసింది మెగా డీఎస్సీ(Mega DSC) కాదని.. దగా డీఎస్సీ అని విమర్శించారు. మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన డీఎస్సీ ప్రకటన ఎన్నికల స్టంటని(Election Stunt) ఆమె ఆరోపించారు.
గుంటూరు జిల్లా తెనాలి (Tenali) మండలం కొలకలూరులో గురువారం ఆమె పర్యటించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఏపీని వదిలి ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న జగన్ ప్రభుత్వం(Jagan Government) పోతేనే రాష్ట్రం బాగుపడుతుందని వెల్లడించారు. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చి మాటతప్పారని దుయ్యబట్టారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం అమ్మకాలు, మద్యం మృతులు ఎక్కువేనని ఆరోపించారు. ఫీజు రియింబర్స్మెంట్ ఇవ్వలేదని అన్నారు. సర్కారు చేస్తున్న దగాకు ఎవరూ మోసపోవద్దని కోరారు. ప్రభుత్వం అండగా ఉన్న ఇసుక మాఫియా వల్ల ప్రజల భూములు కబ్జాకు గురి అవుతున్నాయని, ఇటువంటి ప్రభుత్వం అవసరమా అంటూ ప్రశ్నించారు.