తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు శ్రీనివాసుడు శనివారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి అవతరంలో భక్తులకు దర్శనం ఇచ్చాడు. కొవిడ్ నిబంధనల మేరకు వాహన సేవలు ఆలయంలో ఏకాంతంగా కొనసాగుతున్నాయి.వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రెడ్డిశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తిరుమలలో శ్రీవారిని నిన్న 56,559 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,751 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న వివిధ కానుకల రూపేణా శ్రీవారి హుండీకి రూ. 5.41 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా తిరుమలకు వచ్చే సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ అధికారులు రద్దు చేశారు.