తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ అధికారులు (TTD Officials) వెల్లడించారు. ఫిబ్రవరి 9న పురందరదాసుల ఆరాధనోత్సవం, 10న తిరుకచ్చినంబి ఉత్సవాలు ప్రారంభం, 14న వసంతపంచమి, 16న రథసప్తమి, 19న తిరుకచ్చినంబి శాత్తుమొర, 20న భీష్మ ఏకాదశి, 21న కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం ఉత్సవాలు జరుగుతాయన్నారు. 24న కుమారధార తీర్థముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడసేవ, 16వ తేదీన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.