అమరావతి : ఏపీలో టీడీపీ ప్రభుత్వ అరాచక పాలనకు, దాడులకు బయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి , వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ( Ambati Rambabu) స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం ఉండవల్లిలో వైసీపీ నాయకులపై దాడిని తీవ్రంగా ఖండించారు. దాడులకు పాల్పడడమే కాకుండా ఉల్టా తమపైనే కేసులు బనాయించడం ధర్మామమా అంటూ ప్రశ్నించారు.
దాడులకు పాల్పడింది స్పష్టంగా వీడియో రికార్డులో ఉందని పేర్కొన్నారు. అనైతీకంగా, అరాచకాలకు పాల్పడుతున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.టీడీపీ దాడులకు బయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమరావతిపై చంద్రబాబు రూ.47 వేల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు . అమరావతిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు దోపిడీకి పాల్పడుతున్నారని
,భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులను వేదిస్తున్నారని,రైతుల పొలాల్లోకి కొండవీటి వాగు నీళ్లను మళ్లిస్తూ పంటను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
అమరావతి రైతుల వద్దకు వెళ్లడానికి పర్మిషన్ కావాలా? అదేమైనా పాకిస్తానా ? అంటూ నిలదీశారు. టీడీపీ గూండాల చేతిలోనే కానిస్టేబుల్ గాయపడ్డారని అంబటి స్పష్టం చేశారు. సాయికృష్ణ కేసును సీబీఐతో విచారించాలని తల్లి విజయలక్ష్మి పిటిషన్ వేసింది. డెడ్బాడీ విలువ చంద్రబాబు, పవన్ కల్యాణ్కు తెలుసా.. డెడ్బాడీ, బూడిద కూడా ఇవ్వకుండా క్రిమినల్ అంటూ మాట్లాడడం సమంజసమా అంటూ ప్రశ్నించారు. గాదె సాయికృష్ణ కేసును ఎఫ్ఐఆర్ నుంచి