అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో 45 రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో కుల పోరాటం కాదని, పేదవాడికి మేలు జరిగే విధంగా ఎన్నికలు జరుగాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ (CM Jagan) వైసీపీ అభ్యర్థులకు, నాయకులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలో మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని, ఆ విశ్వసనీయత వైసీపీకి ఉందని పేర్కొన్నారు.
అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. సాధ్యం కానీ హామీలను చంద్రబాబు (Chandra babu) మేనిఫెస్టోలో పెట్టారని విమర్శించారు. వైసీపీ తరుఫున పోటీ చేసే అభ్యర్థుల మార్పు 99 శాతం పూర్తయిందని, ఇప్పటికే నిర్ణయించిన మీదట వారే అభ్యర్థులని స్పష్టం చేశారు. ఒకటి, రెండు చోట్ల మాత్రమే మార్పులు ఉంటాయని అన్నారు.
45 రోజుల్లో ప్రతి నాయకుడు, కార్యకర్త ఐదుసార్లు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, వాటి వల్ల ఇంటి యజమానికి కలిగిన లాభాలను వివరించాలని సూచించారు. పేదవాడు బాగుపడాలంటే వైసీపీ రావాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని కోరారు. ఏపీలో 175 స్థానాలకు175 స్థానాలు. 25 ఎంపీ స్థానాలకు 25 స్థానాలు వైసీపీ అభ్యర్థులే గెలవాలని ఆ దిశగా అడుగువేయాలని పిలపునిచ్చారు.