అమరావతి : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు తిరుమలకు రానున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుమలకు చేరుకుంటారు. యోగి మల్లవరం వద్ద రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో పాల్లొని శ్రీ పద్మావతి అతిథిగృహంలో బస చేయనున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారని, 10.30 గంటలకు పుష్పగిరి మఠంలో జరిగే మరో కార్యక్రమంలో పాల్గొని, తిరిగి మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు.