తిరుమల: తిరుమల శ్రీవారి వైకుంట ద్వార దర్శనం గురువారం అర్ధరాత్రి 1:40 గంటలకు ప్రారంభం కానుంది. తిరుమల ఆలయంలో రేపు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనుండగా, ముందుగా ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీల దర్శనం తర్వాతనే భక్తులందరినీ అనుమతిస్తారు. ద్వాదశి పర్వదినాన శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించి ఉత్సవాలను పురస్కరించుకుని రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వర్ణ రథంపైశ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వ్యక్తిగతంగా వచ్చే వీఐపీలకు దర్శన టికెట్లు అందజేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. వసతి ఏర్పాట్ల కోసం శ్రీ పద్మావతి అతిథి గృహం పరిధిలోని వెంకటకళా, రామ్ రాజ్, సీత, గోవింద్ సాయి, సన్నిదానం అతిథి గృహాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. 22వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనున్నది. టోకెన్లు పొందిన భక్తులకు ఈరోజు అర్ధరాత్రి నుంచి ఉత్తర ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తారు.