అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని రెండు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం తలార్లపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తాపడి 8 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా సమీపంలోని మారమ్మ ఆలయానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
కాగా బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నాతల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రోడ్డు దాటుతున్న పాదచారులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో నలుగురికి గాయాలు అయ్యాయి. వీరిని గుంటూరు జీజీహెచ్లో ఆస్పత్రికి చేర్పించగా చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు.