హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): 2025-2026లో తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డుస్థాయిలో లడ్డూ ప్రసాదాలు విక్రయాలు జరిపి కొత్త చరిత్ర సృష్టించిందని టీటీడీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13.95 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించినట్టు వెల్లడించింది.
లడ్డూల విక్రయాల ద్వారా రూ.567 కోట్ల ఆదాయం లభించినట్టు పేర్కొన్నది. రోజువారీగా సగటున 4లక్షల లడ్డూలను తయారు చేసి, అదేస్థాయిలో విక్రయాలు జరుపుతున్నట్టు తెలిపింది.