అమరావతి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలోని పాత రథ చక్రానికి దుండగులు నిప్పుపెట్టి దహనం చేశారు. ఆలయ ఆవరణలో రాత్రి జరిగిన సంఘటనపై వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కొత్త రథాన్ని తయారు చేయడంతో పాత రథాన్ని, చక్రాలను కొంతకాలంగా ఆలయ సమీపంలో వృథాగా ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాణిపాకం ఆలయానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.