YS Viveka Murder Case | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారి రాంసింగ్ను విచారణాధికారి బాధ్యతల నుంచి తప్పించి, మరోఅధికారిని నియమించాలని కోరుతూ నిందితుడు శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్పై జస్టిస్ ఎంఆర్షా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
హత్య కేసు దర్యాప్తును ఎందుకు పూర్తి చేయడం లేదని, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని దర్యాప్తు అధికారిని ధర్మాసనం ప్రశ్నించింది. కేసు విచారణ త్వర గా ముగించకుంటే మరో అధికారిని ఎందుకు నియమించకూడదని కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో పురోగతి ఉందని, దర్యాప్తు అధికారిని మార్చాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సీబీఐ వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.