అమరావతి : చెరువులో లభ్యమైన మృతదేహం తమ కుమారుడిదే అనుకుని అంత్యక్రియలు చేసి మూడోరోజుకు కర్మకాండ చేస్తున్న సమయానికి కుమారుడు తిరిగివచ్చిన వింత ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మనుబోలు మండలం వడ్లపూడిలో నివాసముంటున్న దంపతుల కుమారుడు నాలుగురోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఈ దశలో వెంకటాచలం మండలం కనపూరు చెరువులో గుర్తు పట్టలేని విధంగా ఉన్న మృతదేహం లభ్యమైంది.
ఆ మృతదేహం తమ కుమారుడుదేనని భావించి తల్లిదండ్రులు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఇవాళ మూడోరోజు కర్మకాండ నిర్వహిస్తుండగా ఇంటికి తిరిగివచ్చిన కుమారుడిని చూసి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే నిన్న ఖననం చేసింది ఎవరి మృతదేహమనే అంశంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.