తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 70,674 మంది భక్తులు దర్శించుకోగా 35,930 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4.53 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
సెప్టెంబర్ నెల అంగ ప్రదక్షిణం టోకెన్లకు సంబంధించిన ఆన్లైన్ కోటాను ఈనెల 22న ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది. అయితే సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించే 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అంగప్రదక్షిణం టోకెన్లను రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి అంగ ప్రదక్షిణం టోకెన్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించింది.