అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రదారులెవరో తేలిపోయిందని, ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు అన్నారు. ఈ రోజు పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయనమాట్లాడారు. వివేకా హత్యలో ఏపీ సీఎం వైఎస్ పూర్తిగా కూరుకుపోయారని.. ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందని పేర్కొన్నారు. వివేకా హత్యను నాడు నాపై నెట్టి జగన్ రాజకీయంగా లబ్ధిపొందారని అన్నారు. బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పతనమయ్యారని ఆరోపించారు.
వివేకా హత్యకేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడం అసాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. హత్యను పాత్రదారులకే పరిమితం చేయకుండ సూత్రదారులను బోనులో నిలబెట్టాలని కోరారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థుల బాధలు కలిచివేస్తున్నాయని వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పేరుతో వంటనూనె ధరలను ప్రభుత్వం పెంచడం దుర్మర్గమని, రానున్న రోజుల్లో ఇవి మరింత భారం కాకుండా ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.