తిరుమల : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) బుధవారం సాయంత్రం 4.08 గంటలకు నెల్లూరు జిల్లా, శ్రీహరికోట అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం (SHAR) నుంచి పిఎస్ఎల్వి సి 59 (PSLV-C59) రాకెట్ని ప్రయోగించనుంది. ఈ సందర్భంగా ఇస్రో టీం (Tirumala) శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంది. రాకెట్ నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందారు.
పీఎస్ఎల్వీ సీ 59 రాకెట్లో ప్రోబా-3 (Proba-3) మిషన్ ఉంది. ఈ ప్రయోగం ద్వారా 550 కేజీల బరువున్న శాటిలైట్లను భూ కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నారు. రాకెట్ ప్రయోగంలో 4 దశలుంటాయి. రాకెట్ సహా మొత్తం 320 టన్నులను నింగిలోకి పంపబోతున్నారు. ప్రోబా-3 మిషన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీది. ఈ ప్రయోగం ద్వారా 61వ పిఎస్ఎల్వి రాకెట్ని ఇస్రో నింగిలోకి పంపబోతోంది.
షార్లోని మొదటి ప్రయోగ వేదికపై ఇప్పటికే అనుసంధానం పనులు పూర్తయ్యాయి. ఈ మిషన్లో రెండు ఉపగ్రహాలను అమర్చారు. ఇందులో ఓకల్టర్ శాటిలైట్ (ఓఎస్సీ), కరోనా గ్రాస్ శాటిలైట్ (సిఎస్సీ ) అనే రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ రెండు ఉపగ్రహాలు ఒకే లైనులో ఏర్పాటు చేశారు. ఈ భూమి నుంచి సుమారు 60 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ ప్రయోగ విజయం తర్వాత మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన ద్వారా ప్రయోగించే అవకాశం లభిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ మంగళవారం మధ్యాహ్నం 2.38 నిమిషాలకు ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 4.08 నిమిషాలకు రాకెట్ను ప్రయోగించనున్నారు.