హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం ఒక్కరోజే 71,361 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా టీటీడీకి రూ.3.69 కోట్ల ఆదాయం సమకూరింది.
ఈ నెల 15 నుంచి 23 వరకు జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా రోజుల్లో రోజూ లక్ష మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నారు.