తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 14 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 60,609 మంది భక్తులు దర్శించుకోగా 23,394 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చిందన్నారు.
5న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
ఫిబ్రవరి 5న పౌర్ణమి గరుడసేవను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారన్నారు.