తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తున్నారు. నిన్న స్వామివారిని 56,003 మంది దర్శించుకోగా 20,365 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.89 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపారు. రేపటి వరకు వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుందని వెల్లడించారు.
టీటీడీ ట్రస్టులకు రూ.20 లక్షలు విరాళం
ఒడిస్సా రాష్ట్రానికి చెందిన శివం కాండివ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డీడీలను సంస్థ ప్రతినిధులు తిరుపతికి చెందిన రాఘవేంద్ర తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీ
ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.