తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల (Tirumala) వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 25 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న 73,016 మంది భక్తులు దర్శించుకోగా 20,915 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు వచ్చిందని వివరించారు.