తిరమల: తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులతో వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఉన్న 31 కంపార్టుమెంట్లలో 8 కంపార్టుమెంట్లు(Compartments) భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
నిన్న స్వామివారిని 61,576 మంది భక్తులు దర్శించుకోగా 23,412 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.3.54 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.