అమరావతి : ఏపీలో సంచలనం రేపిన కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి నిరాశ తప్పలేదు. తనకు బెయిల్ ఇవ్వాలని ఇదివరకు రెండుసార్లు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కోర్టుకు పిటిషన్ పెట్టుకోగా కోర్టు తిరస్కరించింది. మూడో పిటిషన్ దాఖలు చేయగా ఈరోజు విచారించిన కోర్టు ఈనెల 22న తిరిగి విచారణ చేపడుతామని వాయిదా వేసింది.
అనంతబాబు మే 23 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మే 19న రాత్రి కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య జరిగిన సంగతి తెలిసిందే. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఎమ్మెల్సీ ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నా యి. మే 20న తెల్లవారుజామున ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులోనే సుబ్రహ్మణ్యం మృత దేహాన్ని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులను బెదిరించి అప్పగించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదులు, ఆయా రాజకీయ నాయకుల ఆందోళనల ఫలితంగా పోలీసులు అనంతబాబును అరెస్ట్ చేయగా.. సుబ్రహ్మణ్యంను హత్య చేసింది తానేనంటూ ప్రాథమికం గా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేసింది.
కాగా హత్య కేసుపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఎట్టకేలాగు ఇవాళ మూడు నెలల అనంతరం ఎమ్మెల్సీ అనంతబాబుపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.