విజయవాడ: ఎందరో మహనీయులు ఎంత కష్టపడి మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారనే విషయాన్ని భావి తరాలకు తెలియజెప్పే ప్రయత్నం ఎంతగానో ఆకట్టుకున్నది. అప్పటి స్వాతంత్ర పోరాటాన్ని కండ్లకు కట్టినట్లు ప్రదర్శించి అందరిచే మన్ననలు అందుకున్నారు. స్వతంత్ర సంగ్రామంలోని రెండో భాగంగా సైమన్ కమిషన్, జలియన్వాలాబాగ్ ఘటన, భగత్సింగ్, ఆయన అనుచరుల ఉరి, నేతాజీ పోరాటం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర పోరాట ఘటనలను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని జాతీయ జెండాను ఎగురవేయడంతో ముగించారు.
డాక్టర్ రామన్ ఫౌండేషన్కు చెందిన సాయిబాబా నాట్య మండలి కళాకారులు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆకట్టుకునేలా ప్రదర్శించారు. ఈ మెగా డ్రామాను డాక్టర్ పీవీఎన్ కృష్ణ రచించి దర్శకత్వం వహించారు. యూనియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్, సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్, స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్తో కలిసి సంస్కార భారతి నిర్వహించింది. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత, నృత్య కళాశాలలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు.
అలనాటి సంఘటనలను అచ్చుగుద్దినట్లుగా మనకు అందించేందుకు బ్యాక్ గ్రౌండ్ విజువల్స్తో ప్రేక్షకులకు సరైన మూడ్ క్రియేట్ చేసేలా దర్శకుడు చర్యలు తీసుకోవడం విజయవంతమయ్యారు. కాస్ట్యూమ్స్, మేకప్, సంగీతం ఎంతో ఆకట్టుకున్నాయి. బ్రిటీష్ అధికారులపై ప్రకాశం పంతులు పోరాటం, దండి సత్యాగ్రహం, కాంగ్రెస్ సదస్సు, భగత్ సింగ్ జైలు సన్నివేశం వంటివి చాలా బాగా విజువలైజ్ చేసి ప్రేక్షకుల్ని ఆనాటి పోరాటంలో చేయడంలో దర్శకుడు కృతార్థుడయ్యారని చెప్పవచ్చు.