అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి పూట కొత్త జిల్లాల నోటిఫికేషన్ సరైన నిర్ణయం కాదని వైసీపీ రెబెల్ ఎంపీ రామకృష్ణరాజు అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేబినెట్లో జిల్లాలపై చర్చ జరగకుండానే అర్ధాంతరంగా తీసుకురావాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టకుండా జిల్లా విభజన చేయాలని సూచించారు. అర్ధరాత్రి జీవోలు అమలు చేసి జిల్లాల విభజన చేపడుతున్నారు. పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు అంటున్నారు. అర్ధరాత్రి జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరమేముందని పేర్కొన్నారు.
రాజ్యంగం గురించి గొప్పగా మాట్లాడుతున్న వారు అదే రాజ్యాంగాన్ని గౌరవి స్తే 2వందల కేసులను ఓడిపోయేవాళ్లం కాదని అన్నారు. రాజ్యాంగం ఫాలో కావాలన్నందుకే నన్నుకొట్టారని ఆరోపించారు. ఒక ఎంపీ నియోజకవర్గంలో తిరిగే హక్కు కూడా ఏపీలో లేదని ఏపీలో ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ అశోక్బాబు చదివిన చదువు అతడు చేసిన ఉద్యోగానికి సరిపోతుందని అన్నారు. ఐదో తరగతి చదువుకున్న వారికి మంత్రి పదవి, సలహాదారులను కూడా జగన్ నియమించారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ రాజ్యాంగం గురించి చదువుకుని మెలగాలని సూచించారు.