అమరావతి : రాష్ట్రంలో పలు కారణాలతో నిలిచిపోయిన స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికలు ఆదివారం ముగిసాయి. ఏపీలో 36 సర్పంచి, 68వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పోలీంగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 69 పంచాయతీలకు గానూ 30 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 533 వార్డులకు 380 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ జిల్లాలోని 36 సర్పంచ్ స్థానాలకు, వివిధ గ్రామాల్లోని 68 వార్డుల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది.
పోలింగ్, లెక్కింపు సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు మరో 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమయ్యాయి.