అమరావతి : ఆరుగాలం కష్టపడి పంటను పండించే రైతుకు గిట్టుబాటు ధర వస్తే ఎంతో సంతోషం.. కాని అదే రైతుకు అనుకోకుండా తన పంట పొలంలో విలువైన వజ్రం లభిస్తే పట్టరాని సంతోషం. అలాంటి అరుదైన అదృష్టం కర్నూలు జిల్లాకు చెందిన ఓరైతుకు దక్కింది .
మద్దెకర మండలంలోని బసినేపల్లిలో ఓ రైతు(Farmer) తొలకరి వర్షానికి పొలాన్ని దున్నుతుండగా ఒక్కసారిగా రాయిలాంటి వస్తువు కనబడింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షించగా వజ్రం(Diamond) ముద్దలా కనిపించడంతో వ్యాపారి వద్దకు తీసుకెళ్లాడు. ఆ వజ్రాన్ని పరిశీలించిన వ్యాపారి విలువైన(Costly) వజ్రమని తేల్చడంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లభించిన వజ్రం విలువ సుమారు రెండుకోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలియడంతో ఆ రైతు సంబ్రమాశ్చార్యంలో మునిగిపోయాడు.
అనంతపురం(Anantapuram), కర్నూలు(Kurnool) జిల్లాల సరిహద్దుల్లో విలువైన వజ్రాలున్నాయని చరిత్రకారులు అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా మద్దికెర ప్రాంతంలో వజ్రాల వేట కోసం జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ప్రజలు వచ్చి అన్వేషణ కొనసాగిస్తుంటారు. అనుమానంగా ఉన్న ఏ చిన్న రాయినైనా వెంట తీసుకెళ్లి పరీక్షించుకోవడం ఇక్కడా తరుచూ జరుగుతున్న విషయాలు సాధారణమే . బసినేపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికిందని తెలియగానే గ్రామస్థులు కూడా తమ అదృష్ట్రాన్ని పరీక్షించుకోవడానికి పంట పొలాల బాటన పట్టి అన్వేషణ మొదలు పెట్టారు.