వికారాబాద్ : ఉమ్మడి మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని నాగారం గ్రామ సమీపం వద్ద దోర్నాల గ్రామానికి చెందిన దంపతులు ప్రయాణిస్తున్న కారు వాగు ప్రవాహానికి కొద్దిదూరం వరకు కొట్టుకు పోయింది. డ్రైవర్ వాగు ప్రవాహాన్ని గమనించకుండాముందుకు తీసుకెళ్లడంతో ప్రవాహానికి కారు కొట్టుకుపో యి గట్టు వద్ద ఉన్న చెట్టు అడ్డురావడంతో వారు ప్రాణాలతో బయట పడ్డారు.
కారు నీటిలో మునిగిపోగా భార్యభర్తలు కారునుంచి బయటకు వచ్చి ఎత్తయిన కొమ్మల సహాయంతో చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. వర్షం వల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.