తిరుమల : ‘ శ్రీ వేంకటేశ గోవిందా.. శ్రీ శ్రీనివాస గోవిందా ’ అంటూ భక్తులు తిరుమల ( Tirumala ) కు చేరుకుంటున్నారు. నిన్న కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు ( Compartments ) నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం అవుతుందని ఆలయ అధికారులు వివరించారు. గురువారం స్వామివారిని 61,582 మంది భక్తులు దర్శించుకోగా 19,757 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4.35 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.