అమరావతి : ప్రజలను ఆకట్టుకునేలా సహకార బ్యాంకులు పనిచేయాలని అప్పుడే బ్యాంకుల మనుగడ సాధ్యమవుతుందని ఏపీ సీఎం జగన్ సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, సహకార శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి ప్రజలను, రైతులను ఆదుకోవాలని సూచించారు. ప్రసుత్త పోటీ వాతావరణాన్ని ఎదుర్కొనేలా సహకార సంఘాలు , డీసీసీబీలు చర్యలు తీసుకోవాలన్నారు. సహకార కేంద్ర బ్యాంకులు ఆర్థికంగా బలంగా ఉంటే రైతులకు ఎంతో లబ్ధి జరుగుతుందని పేర్కొన్నారు.