తిరుమల : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ యుయు.లలిత్కు చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్కు వేద పండితులు వేదశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తీర్థప్రసాదాలు, 2023 టీటీడీ క్యాలెండర్, డైరీలను చైర్మన్ అందజేశారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన హనుమంత వాహన సేవలో సీజేఐ పాల్గొని పల్లకిని మోసారు. అనం రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ యుయు.లలిత్కు జేఈవో వీరబ్రహ్మం స్వాగతం పలికారు . ఆగమ సలహా దారు శ్రీనివాసాచార్యులు ,అర్చకులు బాబు స్వామి తదితరులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.