అమరావతి : ఏపీలోని విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో ప్రైవేట్ కంపెనీలో చీఫ్ ఇంజినీర్ ( Chief Engineer) గా పనిచేస్తున్న హర్షవర్దన్ (36) అనే వ్యక్తి బలవన్మరణానికి ( Suicide) పాల్పడ్డాడు. ఇంట్లో సూసైడ్ లేఖను( Suicide Letter ) రాసి బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా రైల్వే స్టేషన్లో విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.