అమరావతి : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో మంగళవారం అగ్నిప్రమాదం సంబవించింది. ఆలయంలోని అన్నపూర్ణ భవన్లో వంటకు వినియోగించే బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో భక్తులు పరుగులు దీశారు. పేలుడు దాటికి బాయిలర్లోని ఎస్ఎస్ ట్యాంకు ఎగిరిపడింది . ఆ సమయంలో సిబ్బంది లేకపోవడంతో పెన ప్రమాదం తప్పింది. అన్నపూర్ణ భవన్ అవతల భక్తులు ఉండడంతో ఎవరికి ఎలాంటి నష్టం జరుగలేదు. విషయం తెలుసుకున్న దేవస్థానం అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.