అమరావతి : కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడు గ్రామానికి చెందిన చెందిన వెంకటేశ్ అనే యువకుడు వారం రోజుల క్రితం కువైట్ సెంట్రల్ జైలులో ఆత్మహత్య చేసుకోగా అతడి మృతదేహం ఈరోజు స్వగ్రామానికి చేరుకోనుంది. కువైట్ నుంచి చెన్నైకి ఎమిరేట్స్ విమానంలో మృతదేహాన్ని తరలించనున్నారు. కువైట్లోని ఆర్దియా ప్రాంతంలో ముగ్గురిని హత్యచేసిన కేసులో వెంకటేశ్ను పోలీసులు అరెస్టు చేయగా జైలులో ఒంటిపై ఉన్నదుస్తులతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అతడికి భార్య స్వాతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నెల 25న ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి నగదు, బంగారు దోచుకున్నాడని అక్కడి పోలీసులు ఆరోపిస్తు అతడిపై కేసు నమోదు చేశారు. వెంకటేశ్ భార్య స్వాతి మాట్లాడుతూ తన భర్త ఎలాంటి నేరం చేయలేదని, కువైట్ ప్రభుత్వమే తన భర్తపై నేరం మోపుతూ జైలులో పెట్టిందని రోదించారు.