అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో నిర్వహించే మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని జీఏడీ కార్యదర్శి పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులకు లేఖ రాసారు.
రివర్స్ పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని , అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఇవ్వాలని, పాత జీతాలు చెల్లించాలని కోరుతూ మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళలను నిర్వహిస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 3న నిర్వహిస్తున్న చలో విజయవాడ, 6న అర్ధరాత్రి నుంచి నిర్వహిస్తున్న సమ్మెకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.