అమరావతి : ఏపీలో ప్రకాశంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులను అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద రోడ్డుప్రమాదం అర్ధరాత్రి బైక్ను లారీ కొట్టగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అంబాపురం గ్రామానికి చెందిన వినోద్, నాని, వీరేంద్ర మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
అయితే ప్రమాదానికి గల బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ మృతుల బంధువులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు చెల్లించాలంటూ బైటాయించడంతో రహదారిపై ఇరువైపుల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కనిగిరి ఆర్డీవో, దర్శి డీఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తూ మృతుల బంధువులతో మాట్లాడుతున్నారు.