అమరావతి : ఏపీలోని అల్లూరు జిల్లా పాడేరు ఘాట్రోడ్డులో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుల మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు లోయలో పడడంతో ఇద్దరు మృతి (Two passengers Died) చెందగా మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
చోడవరం నుంచి పాడేరుకు సుమారు 45 మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు పాడేరు ఘాట్రోడ్డు(Ghat Road) వ్యూపాయింట్ మలుపు వద్ద చెట్టు కొమ్మ అడ్డురావడంతో 50 అడుగులలోతు లోయలో పడిపోయింది . దీంతో బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు (passengerss) మృతి చెందగా మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మరికొద్ది మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఘటన విషయం సమచారం అందుకున్న స్థానికులు హుటాహుటినా అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టి బస్సులోని ప్రయాణికులను బయటకు తీశారు.
గాయపడ్డ క్షతగాత్రులను పాడేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గాయపడ్డ వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. బస్సు నడుపుతున్న డ్రైవర్కు సైతం తీవ్ర గాయాలు అయ్యాయి.