అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఏపీ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఫలితాలను విడదుల చేయనున్నారు. http//www.bse.ap.gov.in/ అనే వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీవరకు పది పరీక్షలు జరిగాయి. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఈసారి ఫలితాలను గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ప్రకటించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఎవరైనా ర్యాంకులపై ప్రకటనలు ఇచ్చే విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇదివరకే విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు.