Tension @ Tirupati-Perur | ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పరిధిలో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పేరూరు చెరువుకు మరోవైపు గండి కొట్టేందుకు పాతకాల్వ గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పేరూరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పేరూరు చెరువుకు గండి కొట్టి తమ ఊరిని నిండా ముంచేందుకు పాతకాల్వ గ్రామ ప్రజలు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇరు గ్రామాల ప్రజలు పరస్పరం ఘర్షణకు దిగుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులతో పేరూరు గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఈ ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.