అమరావతి : ఏపీలో కూటమి జాబితా రెండు పార్టీల్లో చిచ్చును రేపుతుంది. స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు టికెట్ ఇస్తే సహించేది లేదంటూ నిరసనలు తెలుపుతున్నారు. పెనుమలూరు(Penumalur) లో స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడాన్ని నియోజకర్గ నాయకులు బోడె ప్రసాద్, అనుచరులు తీవ్ర నిరసన తెలిపారు. టీడీపీ కార్యకర్త (TDP worker ) ఒకరు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అక్కడే ఉన్న నాయకులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ సందర్భంగా బోడే ప్రసాద్(Bode Prasad) మాట్లాడుతూ ఐదేండ్లు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డానని, ఇందుకోసం కొట్లాది రూపాయలను వెచ్చించానని అన్నారు. నియోజకవర్గంలో స్థానికులకు ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరిస్తామని, స్థానికేతరులకు ఇస్తే చంద్రబాబు బొమ్మ పెట్టుకుని ఇండిపెండెంట్గా నైనా పోటీ చేసి గెలుస్తానని పేర్కొన్నారు. నా రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదని తెలిపారు. నాకు టికెట్ ఇవ్వడం లేదని తెలిసి నా గుండె పగిలిందని వాపోయారు. నేను ఇక్కడే ఉండి పోరాటం చేస్తానని ప్రకటించారు.