అమరావతి : మాజీ ప్రధాని, తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు (PV NarasimhaRao) కు కేంద్ర ప్రభుత్వం ‘ భారత రత్న’ (BharatRatna) ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandra Babu) అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ఎక్స్(Twitter X) లో స్పందించారు. బహుభాషా కోవిదుడికి సముచిత రీతిలో సత్కరించడం పట్ల కేంద్రానికి అభినందనలు తెలిపారు.
భారత ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పీవీ నాయకత్వం, చేపట్టిన సంస్కరణలు దేశానికి ఎంతగానో ఉపయోగ పడ్డాయని అన్నారు. భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తుల్లో పీవీ ఒకరని అభిప్రాయపడ్డారు. తన రాజకీయ ప్రస్థానం (Political Period) లో పీవీని అనేక సందర్భాల్లో కలిసిన అదృష్టం తనకు దక్కిందని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు ఇచ్చిన స్ఫూర్తితో తానూ పలు కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.