IAS Srilakshmi | ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మీ పేరును తొలగించడం కుదరదని గతంలో ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ఒబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పేరును తొలగిస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టులో సీబీఐ సవాలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కేసులో మరోసారి వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. సుప్రీం ఆదేశాలతో జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనల అనంతరం తీర్పు వెలువరించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.