Sankranthi | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేందుకు ఆంధ్ర ప్రజలు రైళ్లు, బస్సులను నెల రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. జనవరి 14, 15, 16 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ ఉన్నాయి. దీంతో 11, 12, 13 తేదీల్లో రైల్వే టికెట్ బుకింగ్ ఇప్పటికే నిండిపోగా, ఊర్లకు వెళ్లే సమయానికి కన్ఫర్మ్ అవుతుందనే ఆశతో చాలా మంది ఇంకా బుకింగ్ చేసుకుంటున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి విశాఖపట్నంతోపాటు చెన్నై, ముంబయి, బెంగళూరు నుంచి ఒడిశా వైపు వెళ్లే రైళ్లకు డిమాండ్ ఎకువగా ఉన్నది.