అమరావతి: అనంతపురంలో ఐక్య ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. సంఘం మహా సభల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆర్ట్స్ కళాశాల నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల ప్రకటించిన పీఆర్సీ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎలాంటి మేలు జరుగలేదని, పైగా ప్రభుత్వం మోసం చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు ఆరోపించారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ను రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ దాని జోలికి వెళ్లడం లేదని విమర్శించారు.
అశుతోష్ మిశ్రా ఇచ్చిని నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదని అన్నారు. విద్యారంగ సమస్యలపై రాష్ట్ర మహాసభలో తీర్మాణం చేస్తామని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ ఒకటో తేదీ తరువాత ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ .. ఏపీలో ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని , శాసనమండలి సమావేశంలో ఈ విషయంపై నిలదీస్తామని వెల్లడించారు.