అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టీడీపీ(TDP) మూడో జాబితాను విడుదల చేసింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు (Chandra Babu) శుక్రవారం 11 శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం(Srikakulam) నుంచి గొండు శంకర్, శృంగవరపు కోట నుంచి కోళ్ల లలితకుమారి , కాకినాడ సిటీ (Kakinada City) నుంచి వనమూడి వెంకటేశ్వరావు పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు.
అమలాపురం (ఎస్సీ) నుంచి అయితాబత్తుల ఆనందరావు, పెనమలూరు నుంచో బోడె ప్రసాద్, మైలవరం నుంచి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, నరసరావుపేట నుంచి చదలవాడ అరవిందబాబు, చీరాల నుంచి మద్దులూరి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్లను ప్రకటించారు. మొదటి, రెండు జాబితాలో 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మూడో జాబితాలో 11 మందితో కలిపి మొత్తం 139 అసెంబ్లీ అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించారు. మరో 5 అసెంబ్లీ స్థానాలను పెండింగ్లో ఉంచారు.