అమరావతి : దేశంలో నోట్ల రద్దుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandra Babu) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్టు రద్దు కావాలనేది నా ఆలోచననని, రూ. 200, రూ.500 నోట్లను రద్దు చేసే పరిస్థితి రావాలని అన్నారు. డిజిటల్ రూపే విధానం వైపు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. విజయవాడలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల(TDP Candidates) తో నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు.
రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే 400కు పైగా లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో 160 సీట్లు కూటమికి వస్తాయని అన్నారు. కడప ఎంపీ సీటును మనమే గెలవబోతున్నామని ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రాజీనామా చేశారని కొంతమంది ఫేక్ లెటర్ పెట్టారని, బీజేపీతో తాత్కాలిక పొత్తు అని నా పేరుతో ఫేక్ లెటర్లు పెట్టారని, పవన్కల్యాణ్(Pawan Kalyan) పై కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నామని మరోసారి స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా సీట్లు రాని టీడీపీ అభ్యర్థులకు అండగా ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.