హైదరాబాద్,సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్కు స్వల్ప ఊరట లభించింది. అక్టోబరు 4వ తేదీ వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఫైబర్గ్రిడ్ కేసులో లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను 4కు వాయిదా వేసింది.