అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నుంచి గెలుపొంది వైసీపీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు( Chandra Babu) స్పీకర్ను కోరారు. టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLAs) వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) , కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరి గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ(YCP) లో చేరారు.
వీరిపై అభిప్రాయం చెప్పాలని స్పీకర్(Speaker) పేషి నుంచి అందిన లేఖకు చంద్రబాబు సమాదానమిస్తూ మరో లేఖను స్పీకర్కు పంపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ కావడంతో వాటిని భర్తీ చేయడానికి ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తుంది.
ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో రెండు అధికార వైసీపీ దక్కించుకునేందుకు పూర్తి సంఖ్యాబలం అసెంబ్లీలో ఉంది. మరో స్థానం టీడీపీ పరం కాకుండా పావులు కదుపుతూ వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన గంటా శ్రీనివాస్రావు పై రెండు రోజుల క్రితం అనర్హత వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నలుగురిపై కూడా చర్యలు తీసుకోవాలని టీడీపీ డోలా పిటిషన్ వేసింది. వీటిని పరిశీలించిన స్పీకర్ పేషి చంద్రబాబుకు తమ అభిప్రాయాన్ని చెప్పాలని కోరింది.