తెలుగుదేశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత నారా లోకేశ్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. అసూయకు అన్నలాంటి వాడు సీఎం జగన్ అని ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అందుకే తన తండ్రికి, బాబాయ్కి టిక్కెట్ ఇచ్చి పంపించేశాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోసారి జగన్ అసూయతో గర్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈసారి గుండెపోటు తల్లికో? చెల్లికో? అంటూ లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ తనకు క్లాస్ పీకారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వాళ్లేమైనా ప్రధాని మోదీ సోఫా కింద దూరి విన్నారా? లేదా తన సోఫా కిందనో దూరి విన్నారా? అంటూ జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాన్ని చూస్తుంటే అసూయకు హద్దేముంది? అని అనిపిస్తోందని జగన్ పేర్కొన్నారు. ఇంత అసూయతో జీవిస్తే.. గుండె పోటులు వచ్చి, తొందరగా టిక్కెట్ తీసుకుంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.